కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ. 8500 చొప్పున ఇస్తాం – ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

-

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు రూ. 8500 చొప్పున ఇస్తామన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఇవాళ మీడియాతో వైయస్ షర్మిల మాట్లాడుతూ….ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అని…ఇప్పుడు యావత్ డ్రగ్స్ సప్లై చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.గంజా, హెరాయిన్,కొకైన్ ఏది కావాలంటే అది దొరికే “ఉడ్తా ఆంధ్రప్రదేశ్”. అంటూ నిప్పులు చెరిగారు.

ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపి వైపే.మొదటి 5 ఏళ్లు TDP ,తర్వాత 5 ఏళ్లు YCP..10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారు.డ్రగ్స్ రవాణా,వాడకంలో నెంబర్ 1 ముద్ర వేశారు.25 వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే…తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టీడీపి ,వైసీపీ,బీజేపీ పార్టీలకు సిగ్గుండాలి.కేంద్ర రాష్ట్రాల నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా…వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయి ? డ్రగ్స్ మాఫియాతో మీకు లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా ? అంటూ నిలదీశారు షర్మిల.

 

మీ అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపి “సేఫ్ హెవెన్” గా మార్చింది ?. తెర వెనుక ఎంతటి వాళ్లున్నా నిజాలు నిగ్గు తేల్చాలని CBI నీ కోరుతున్నాం. ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు,పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news