డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్..ఎల్లుండి డబ్బులు జమ !

-

 

ఏపీలోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. YSR ఆసరా పథకం నిధుల విడుదల తేదీ ఖరారు అయింది. ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్ల అప్పు ఉంది.

ysr asara scheme amount release date

ఇప్పటివరకు నాలుగు విడతల్లో రూ.19,175.97 కోట్లు చెల్లించిన జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం…. మిగిలిన రూ.6394.83 కోట్లను 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెలాఖరు వరకు ఆసరా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది. దీంతో ఏపీలోని డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news