ఏపీలోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. YSR ఆసరా పథకం నిధుల విడుదల తేదీ ఖరారు అయింది. ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు. 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్ల అప్పు ఉంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/01/Jagan-Sarkar-good-news-for-Dwakra-women.jpg)
ఇప్పటివరకు నాలుగు విడతల్లో రూ.19,175.97 కోట్లు చెల్లించిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం…. మిగిలిన రూ.6394.83 కోట్లను 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెలాఖరు వరకు ఆసరా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది. దీంతో ఏపీలోని డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.