ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​లో ఉద్రిక్తత.. ఒంగోలు కేంద్రం వద్ద వైసీపీ-టీడీపీ ఘర్షణ

-

ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​లో పలుచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. నగరంలోని సెయింట్‌ థెరిసా పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు.

ఓటర్లకు సాయం చేసే క్రమంలో వైస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ప్రతి టీడీపీ కార్యకర్తలు కూడా దూషణకు దిగడంతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, ఇతర నేతలు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు వైసీపీ నేతల సమాచారంతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరుపార్టీల నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version