ఒకరిద్దరూ పార్టీ మారితే..వైసీపీ నష్టం లేదు – వైవీ సుబ్బారెడ్డి

-

ఒకరిద్దరూ పార్టీ మారితే..వైసీపీ నష్టం లేదన్నారు వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి. ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పధకాలు, పాలన వైసీపీ బలం అని చెప్పారు. ఏపీలో సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందుతున్న పేదలందరూ వైసీపీని మరోసారి గెలిపించి జగన్ ను సీఎంని చేస్తారని స్పష్టం చేశారు. బీసీలకు సీట్లు ఇవ్వటం కోసమే కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి వస్తుందన్నారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.

yv shubbareddy

ఒకరిద్దరు వెళ్లటం వల్ల మాకేమీ నష్టం లేదు..కొందరు వారి వ్యక్తిగత కారణాల బయటకు వెళ్తున్నారు.. వెళ్లే వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చినా వెళ్తున్నారని వివరించారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని..ఇప్పటికి 35 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేశామని తెలిపారు. అందరికీ సమన్యాయం చేసేందుకే సీఎం జగన్ కృషి.. ఆయన ఎలా ఆదేశిస్తే అలా పనిచేస్తామని చెప్పారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news