ఇండియాలో కొత్తగా 602 కరోనా కేసులు, 5గురు మృతి

-

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 602 కేసులు నమోదు అయ్యాయి, ఐదుగురు కరోనాతో చనిపోయారు. నిన్న 573 కేసులు రాగా.. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. తాజాగా 722 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4440గా ఉంది.

ఇది ఇలా ఉండగా, కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆరుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 18 నెలల బాబుతో పాటు ముగ్గురు మహిళలకు కోవిడ్-జేఎన్1 పాజిటివ్ నిర్థారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో రేకుర్తికి చెందిన ముగ్గురు, చిగురుమామిడి కి చెందిన యువతిగా వైద్యులు గుర్తించారు. వారం రోజుల క్రితం ఇద్దరు మహిళలకు పాజిటివ్ రాగా ప్రస్తుతం వారు కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news