ఎమ్మెల్సీ పదవికి శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా చేసిన.. కొన్ని క్షణాల్లోనే మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు జకియా ఖానం. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన జకియా ఖానం… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆధ్వర్యం లో బీజేపీ పార్టీ లో చేరారు.

జకియా ఖానంకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. అటు ఇవాళ ఉదయం ఎమ్మెల్సీ పదవికి శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా మండలి చైర్మన్కు ఆమె పంపించారు. జకియా ఖానంను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన జకియా ఖానం
కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన జకియా ఖానం
జకియా ఖానంకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి pic.twitter.com/L57qo5R1hO
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2025