ANDHRAPRADESH: రైల్వే స్టేషన్ లో కొడుకుముందే తల్లిపై అత్యాచారం..

-

ఆంధ్రప్రదేశ్ లోని గురజాల రైల్వే స్టేషన్ లో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.ఒక గుర్తు తెలియని మహిళ పై గ్యాంగ్ రేప్ జరిగింది.మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన కామాంధులు భయం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.నిత్యం ఎక్కడో ఒకచోటనిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి.తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి దారుణ ఘటనే చోటుచేసుకుంది.పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో రైల్వే స్టేషన్ లో జరిగింది ఈ ఘటన.వేరే ప్రాంతానికి వెళ్లేందుకు మహిళ రైల్వేస్టేషన్లో వేచి ఉన్న సమయంలో గుర్తుతెలియని ఆగంతకులుు మహిళను సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు.

రాత్రి సమయం కావడంతో ఎవరు ఈ ఘటనను గుర్తించలేకపోయారు.ఘటన సమయంలో బాధితురాలి కొడుకు (3) సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు.అటుగా వెళుతున్న కొంతమంది అపస్మారక స్థితిలో ఉన్న మహిళను ఆసుపత్రికి తరలించి..పోలీసులకు సమాచారం ఇచ్చారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.ఇంతకీ ఆ మహిళ ఎవరు?ఆమె ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతుంది?ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన అగంతకులు ఎవరు?అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version