భర్తను చంపిన భార్య ఘటన మరోటి తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్నగర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. మరో వ్యక్తితో కలిసి భర్త రాకేష్ కుమార్ను హత్య చేసింది భార్య పూనమ్ దేవి. మృతదేహాన్ని బావి పక్కన పడేసి.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరార్ అయింది. అజీజ్నగర్కు చెందిన రాజిరెడ్డి డెయిరీ ఫామ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
రెండు నెలల క్రితం ఫామ్లో కూలీలుగా చేరారు రాకేష్ దంపతులు. ఈ నెల 21న రాకేష్ దంపతులతో పాటు కనిపించాడు మరో వ్యక్తి. తర్వాతి రోజు రాకేష్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లాడని అడిగాడు యజమాని రాజిరెడ్డి. మద్యం తాగొచ్చి తనతో గొడవ పడి ఎక్కడికో వెళ్లిపోయాడని బుకాయించింది భార్య. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఏజెంట్కు ఫోన్ చేసాడు యజమాని. పూనమ్ దేవి, మహేశ్ సాని అనే వ్యక్తి కలిసి రాకేష్ను చంపి బావి వద్ద పడేశారని యజమానితో చెప్పాడు ఏజెంట్. రాయితో తలపై కొట్టి చంపినట్లు గుర్తించిన పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.