అదా శర్మ మరో కాంట్రవర్షియల్ సినిమా ట్రైలర్ రిలీజ్..!

-

అదా శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న బస్తర్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతంలో నక్సలిజం చుట్టూ తిరిగే వాస్తవికతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.బస్తర్ జిల్లాలో ఇండియన్ ఆర్మీకి,నక్సల్స్ కి మధ్య పరస్పరం కాల్పులు జరుగడం..రెడ్ కారిడార్ లో భాగమైన ఈ ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం వంటి సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రం కోసం ఎంతో రీసెర్చ్ చేసి తెరకెక్కించారు. పాకిస్థాన్ తో జరిగిన 4 యుద్ధాల్లో చనిపోయిన మన భారత సైనికుల కంటే ఈ మావోయిస్టులు చంపిన సైనికుల సంఖ్యే రెట్టింపుగా ఉందనే..డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.దట్టమైన అటవీ ప్రాంతాల్లో నక్సల్స్ సృష్టిస్తున్న హింసకు అడ్డుకట్ట వేయడానికి వచ్చిన ఐపీఎస్ అధికారిగా అదా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం మార్చి 15న థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇక బస్తర్ సినిమా కూడా ది కేరళ స్టోరీ సినిమా లాగానే మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.. ఎందుకంటే ఈ చిత్రం కోసం ఎంచుకున్న కథ అలాంటిది.

 

Read more RELATED
Recommended to you

Latest news