మూడో టెస్టుకు దూరం కానున్న మరో స్టార్ ప్లేయర్ …!

-

విశాఖపట్నం లేదు కదా ఐదు టెస్టులలో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ టెస్టులో నాలుగో రోజు 106 రన్స్ తేడాతో ఇండియా ఘనవిజయం సాధించింది.  అయితే ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇండియా బౌలర్ జస్ప్రిత్ బుమ్రా మూడో టెస్టుకు దూరం కానున్నట్లు సమాచారం. రాజ్కోట్ వేదికగా జరిగే మ్యాచు ఆయనకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. చివరి రెండు టెస్టులకు ఉత్సాహంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మిగిలిన మూడు టెస్టులకు బీసీసీ టీమిండియాను ప్రకటించనుంది.

ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి బుమ్రా 9 వికెట్లతో చెలరేగారు.ఈ టెస్టులో ఇండియా యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (209), గిల్ (104)  చెలరేగిపోయి ఆడారు. ఇక ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news