BREAKING : వందే భారత్ ట్రైన్ పై మళ్లీ రాళ్ల దాడి

-

BREAKING : వందే భారత్ ట్రైన్ పై మళ్లీ రాళ్ల దాడి చోటు చేసుకుంది. ఈ సంఘటన ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుందని సమాచారం అందుతోంది. అయితే, ఈ రాళ్ల దాడిలో సీ 12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ధ్వంసమైంది.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితులను గుర్తించారు ఉన్నతాధికారులు. ధ్వంసమైన గ్లాస్ ను విశాఖ స్టేషన్ లో మార్చారు రైల్వే అధికారులు. దీంతో ఆలస్యంగా బయలుదేరింది ఈ వందే భారత్ ట్రైన్. మూడు గంటల లేటు గా విశాఖ – సికింద్రాబాద్ ట్రైన్ పయనం కానుంది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని.. చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news