మేఘాలయ హనీమూన్ జంట కేసులో మరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సోనమ్ తన భర్త రాజా రఘువంశిని చంపడానికి ఇదివరకే మూడుసార్లు ప్రయత్నించినట్లుగా SP సయీమ్ తెలియజేశారు. మొదటిసారి గువాహాటిలో, రెండవ సారి మేఘాలయలోని సోహ్రాలో రెండు సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయినట్లుగా వెల్లడించారు. సావ్ డాంగ్ లో నాలుగో అట్టెంప్ట్ లో రాజా రఘువంశిని హత్య చేసినట్లుగా SP సయీమ్ వెల్లడించారు.

ఈ కేసులో సోనమ్ తో సహా ఆమె లవర్ రాజ్ కుష్వాహ, మరో ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యారు. కాగా, వీరిద్దరి వివాహం గత కొద్ది రోజుల క్రితమే జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇండోర్ కు చెందిన ఈ జంట హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్ళగా అక్కడ మరణించాడు. వివాహం జరిగిన అతి తక్కువ సమయంలోనే రాజా మరణించడంతో తన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనమ్ ను వదిలేది లేదని సీరియస్ అవుతున్నారు. తమ కుమారుడిని హత్య చేసిన వారిని తప్పకుండా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.