పదే పదే అవే ప్రశ్నలతో ఇబ్బంది పడుతున్న హీరోయిన్..!!

-

అల్లు శిరీష్  హీరోగా `అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన సినిమా ఊర్వశీవో రాక్షసివో. శశి ఈ సినిమా కు దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అంతే కాకుండా అల్లు శిరీష్ అను ఇమ్మాన్యుయేల్ ల మధ్య  టీజర్ లో మంచి హగ్ మరియు లిప్ లాక్ సన్నివేశాలు వుండి కుర్రాళ్ళ లో హీట్ పెంచాయి.

దీంతో యూత్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. దాన్ని మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు సినిమా యూనిట్. నవంబర్ 4న రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని ఇప్పటికే మొదలు పెట్టారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అల్లు శిరీష్,`అను ఇమ్మాన్యుయేల్ మధ్య సంబంధం వుందని గోల గోల చేస్తున్నారు. ఎక్కడకి వెళ్ళినా ఈ ప్రశ్నలు అనును ఇబ్బంది పెడుతూనే వున్నాయి.

తాజాగా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిది అడిగిన ప్రశ్న ఆమెను మళ్లీ ఇరకాటం లో పెట్టింది. మీడియా ప్రతినిది మీరు అల్లు అర్జున్ తో మరియు అల్లు శిరీష్ తో కూడా కలిసి పనిచేశారు కదా ఇద్దరిలో క్యూటెస్ట్ ఎవరు..? నాటీ ఎవరు..?’ అని ప్రశ్నించారు. దానితో అను ఇమ్మాన్యుయేల్ మీ దగ్గర  ‘వేరే ప్రశ్నలు లేవా ! సినిమాకు సంబంధించిన ప్రశ్నలు అడగండి’ అంటూ విసుక్కుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news