అనుష్క ‘నిశ్శబ్దం’ క‌థ ఇదేన‌ట‌గా..

-

భాగమతి తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం. యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్గా గా ఈ సినిమా జనవరి 31న విడుదల కాబోతుంది. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజులతో పాటు హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మాడిసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ నిర్మిస్తున్నారు. లుగు, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఇక ఇందులో అనుష్క డెఫ్ అండ్ డమ్ కారెక్టర్ చేస్తుంది. ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని పాత్ర కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమా ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్. సినిమాలో మర్డర్ చేసింది ఎవరు అనే కోణంలోనే చాల భాగం నడుస్తోంది. అయితే సినీ వర్గాల సమాచారం మర్డర్ చేసేది అనుష్కనేనట. ఈ విషయం క్లైమాక్స్ లో ట్విస్ట్ రూపంలో రివీల్ అవుతుందని.. సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉందని తెలుస్తోంది. హత్యకి సంబంధించిన ముడులు ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే తీరు ఆడియన్స్ ను కదలనివ్వదని అంటున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరిగింది. అనుష్క భర్తగా మాధవన్ నటించాడు.

ఇప్పటికే రిలీజ్ చేసిన చిత్ర టిజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, సౌత్‌లో లేడీ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన యోగా బ్యూటీ అనుష్క శెట్టి. సూపర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ భామ గ్లామర్‌ రోల్స్‌తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సత్తా చాటింది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలతో లేడీ సూపర్‌ స్టార్ ఇమేజ్‌ సొంతం చేసుకుంది అనుష్క ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్దం చిత్రంతో ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news