దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. ఇవాళ్టి షెడ్యూల్ ఇదే

-

దిల్లీలో  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం హస్తినకు చేరుకున్న ఆయన ఇవాళ ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. మోదీని కలిసి రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులు, విభజన సమస్యలు, హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బడ్జెట్ కేటాయింపుల వంటి వాటిపై చర్చించనున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం చంద్రబాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు.

దిల్లీలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే..

10.15 గంటలకు ప్రధానితో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

12.15 గంటలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ

2 గంటలకు వ్యవసాయ, గ్రామాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో సమావేశం

2.45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో సమావేశం

శుక్రవారం ఉదయం 9 గం.లకు నీతి ఆయోగ్ సీఈఓతో భేటీ

10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్తో చర్చ

10.45కి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశం

12.30 కేంద్ర మంత్రి అథవాలేతో భేటీ

Read more RELATED
Recommended to you

Exit mobile version