డీఎంకే ప్రభుత్వంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు

-

డీఎంకే ప్రభుత్వంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న తమిళ బీజేపీ నేడు కీలక నేతలతో సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం తమిళనాడు యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాలని తమిళనాడు ప్రజలు సంకల్పించుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రాన్ని అరాచకం వైపు నెడుతోందని.. డీఎంకే ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం అక్కర్లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2026 లో తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మనమంతా సంకల్పిద్దామని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version