ఏపీలో కొత్తగా 165 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో… కరోనా మహమ్మారి కేసులు రోజు రోజు కు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 165 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,77, 486 కి పెరిగింది.

ap carona

ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 497 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1260 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 130 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 61 , 729 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 24 , 219 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 13, 82, 067 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అటు ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version