ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : కొత్తగా రాష్ట్రంలో 749 కరోనా కేసులు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 749 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,12,778 కి పెరిగింది.

ap carona

ఒక్క రోజు వ్యవధిలో మరో 3 గురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 697 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18929 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 6271 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 22,79 , 152 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 22 , 785 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3 , 28 , 31,785 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గతం లో కంటే ఇప్పుడు కరోనా కేసులు భారీగా తగ్గడం శుభ సూచకం.

Read more RELATED
Recommended to you

Exit mobile version