ఏపీలో కరోనా విలయం..ఒక్కరోజే 13,212 కేసులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటి కంటే ఇవాళ మరో వెయ్యి కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,53, 268 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో ఐదుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 532 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 64, 136 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2942 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 74, 600 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 44, 516 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 20, 56, 618 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version