నిరుద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల దరఖాస్తు వివరాలు..

-

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ను చెప్పింది..ఇప్పటికే నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు రాష్ట్రంలో ఉన్న ఖాళీల పై అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఎన్నో సంస్థలలో ఉన్న ఖాళీలను భర్థీ చేశారు..ఈ మేరకు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.ఆ ఉద్యొగాల గురించి పూర్తీ వివరాలు తెలుసుకుందాం..

ఏపీ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి జాబ్ మేళా లకు సంబంధించి ఇటీవల మళ్లీ వరుసగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి..తాజాగా పలు సంస్థలు ఇంజినీరంగ్, ఐటీఐ చేసిన వారికి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సంస్థలు నిర్ణయించిన తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు..

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది . రాజమండ్రి యూనిట్లో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన ఉండనున్నాయి.

మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు..ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి..

ఎలా ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి..

అభ్యర్థులు ముందుగా ఈ లింక్ https://apssdc.in/industryplacements/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

లింక్‌లోకి వెళ్లాక మీరు ఏం స్థలకు అప్లై చేసుకోవాలనుకొంటున్నారో చూసుకోవాలి.

అర్హతలు, వేతనం వివరాలు పరిశీలించుకోవాలి.

అనంతరం More Details ఆప్షన్‌లోకి వెళ్లాలి.

వివరాలు పూర్తిగా చదవిన తరువాత Apply ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు పూర్తి చేయాలి…

ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version