ఎన్టీఆర్ హెల్త్ వర్సీటీ పేరు మార్పునకు ఏపీ గవర్నర్ ఆమోదం

-

ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచంద్రన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచంద్రన్ ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చట్ట సవరణకు ఆయన ఆమోద ముద్ర వేశారు.

గవర్నర్ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ సవరణ చట్టాన్ని అమల్లోకి వచ్చిందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం, రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news