ఆలయాల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

-

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు దేవాలయాలలో విగ్రహాలు ధ్వంసం ఘటనలు ఎక్కువైపోయాయి. ఎప్పుడు ఏ ఆలయంలో విగ్రహం ధ్వంసం అయింది అనే వార్త వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ దేవాలయాల్లో వరుస ఘటనలు నివారణ కోసం ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆలయాల ఘటనల నివారణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ రోజు దేవాదాయ, పోలీసు ఉన్నతాధికారులతో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి భేటీ అవుతున్నారు. ప్రతి దేవాలయంలో సెక్యూరిటీ నియామకంపై సాధ్యాసాధ్యాలను ఈ భేటీలో పరిశీలించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఆలయాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరో పక్క ఏపీలో మరో విగ్రహం ద్వంసం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లలో బుద్ధుడి విగ్రహం ద్వంసం అయిందని వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version