నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

-

నిరుద్యోగులకి ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికోసం 9260 వాహనాలని కొనిచ్చేందుకు సిద్దం అయింది. ఏపీ ప్రభుత్వం క్వాలిటీ బియ్యం డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించుకుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ డెలివరీ చేసే విషయంలో ఆర్థిక భారం తగ్గించే దిశగా ప్రభుత్వం తరపున 9260 వాహనాలని ప్రేవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మరియు ఈబిసి నిరుద్యోగ యువతకు అవకాశం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు.

Jagan
Jagan

ఇక ఈ వాహనాలు కొనుగోలుకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం లోన్ గా సర్కార్ అందించనుంది. ఇక మిగిలిన పది శాతం డబ్బు చెల్లించి యువత వాహనం సొంతం చేస్కోవచ్చు. ఇక లోన్ తిరిగి చెల్లించేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హామీ ఇచ్చేట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆరు సంవత్సరాలు పాటు లోన్ ఉండనుంది ఆ అనంతరం లబ్దిదారుల పేరుతోనే వాహనం రిజిస్టర్ అయ్యేలా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వాహనాల సబ్సిడీ కోసం 331 కోట్లు లోన్ తీసుకునేందుకు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కు అనుమతి ఇస్తున్నట్టు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఖర్చులతో కలిపి బియ్యం డోర్ డెలివరీ కి ప్రతి ఏడాది 776.45 కోట్ల రూపాయలు అదనపు నిధులు మంజూరు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news