ఏపీ ప్రజలకు సర్కార్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

-

ఏపీ ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను పెంచింది. లీటర్ పెట్రోల్‌పై 1.24 పైసలు, డీజిల్‌పై 0.93 పైసలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయిందని, ఈ నేపథ్యంలోనే ధరలు పెంచుతున్నామని రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో 4,480 కోట్లుగా ఉన్న ఆదాయం.. ఈ ఏడాది 1,323 కోట్లకు పడిపోయిందని వెల్లడించారు.

జూన్ నెలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో పడిపోయిన రాష్ట్ర రెవెన్యూను పెంచుకోవడానికే ధరలు పెంచుతున్నామని భార్గవ్ తెలిపారు. ప్రస్తుత పెంపుదల 2015-18 సంవత్సరాల మధ్య వసూలు చేసిన ప్రకారమే ఉందని ప్రభుత్వం తెలిపింది. కాగా, కరోనా లాంటి కష్ట సమయాల్లో కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version