ఇవాళ్టి నుంచి ఏపీ జూడాల సమ్మె.. రేపటి నుంచి అత్యవసర సేవల బంద్

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఏపీ జూడాలు సమ్మెబాట పట్టారు. విజయవాడలో ఒపి సేవలు బహిష్కరించి ఆందోళనకు దిగారు జుడాలు. ప్రజలకు సేవలందిస్తున్న మా పై దాడులు చేయడం సబబేనా ? కరోనా సమయంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలు చేశామని ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడామని.. ఇటీవల వైద్యుల పై దాడులు పెరిగిపోతున్నాయని అగ్రహించారు.

చట్టాలు ఉన్నా… వాటిని అధికారులు అమలు చేయడం లేదని.. మొక్కుబడి చర్యల వల్ల మాకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కఠిన శిక్షలు ఉంటేనే… దాడులను అరికట్టవచ్చని.. మాకు భద్రత ఉంటుందనే భరోసా ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేశారు జూనియర్ డాక్టర్లు. దాడులు చేసిన వారిని అరెస్టు చేసి వెంటనే శిక్ష పడేలా చూడాలని.. ఈరోజు నుంచి ఓపి సేవలను నిలిపివేశామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుంచి అత్యవసర సేవలను బహిష్కరిస్తామని హెచ్చరించారు జూనియర్ డాక్టర్లు.

Read more RELATED
Recommended to you

Latest news