చెప్పులు వేసిన చేత్తోనే దండలు వేస్తున్నారు: మంత్రి జోగి రమేష్

-

ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ తాజాగా చంద్రబాబు పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోకి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ జయంతి ఉత్సవాలకు విచ్చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ చిత్రపటానికి మాలలు వేసిన అంశాన్ని గురించి మాట్లాడుతూ రెచ్చిపోయారు జోగి రమేష్. ఎన్టీఆర్ ను ఆనాడు సొంత పార్టీ నుండి గెంటి వేసి … సొంత నాయకుల చేత చెప్పులతో కొట్టించి చిత్రవధ చేశారు. దీనికి కర్త కర్మ క్రియగా చంద్రబాబు ముందుండి నడిపించి ఎన్టీఆర్ దారుణ పతనానికి కారణం అయ్యాడు. ఇప్పుడు ఆయన జయంతి ఉత్సవం అని వచ్చి ఆయన పటానికి పూలదండలు వేస్తే చాల బాధగా ఉందంటూ జోగి రమేష్ చెప్పారు.

ఇప్పుడు పైన నుండి చూస్తున్న ఎన్టీఆర్ కు చంద్రబాబు ను చంపెయ్యాలన్న కసితో ఉంటారని జోగి రమేష్ మాట్లాడారు. మరి ఈ వ్యాఖ్యలపై టీడీపీ నుండి ఎవరైనా బదులు ఇస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version