మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఏపీ మినిస్టర్ వాసంశెట్టి!

-

ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం ఉదయం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురి భేటీలో తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులు, రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ,అభివృద్ధి పథకాల తీరుపై చర్చలు జరిపారు.

మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్ఆర్ఆర్, మూసీ శుద్ధీకరణ, జాతీయ రహదారుల విస్తరణ అంశాలను వాసంశెట్టి సుభాష్‌‌కు వివరించినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్-65 విషయంలో కోమటి రెడ్డి చూపిన చొరవ వల్ల ఆంధ్రా తెలంగాణ మధ్య రవాణా పరిస్థితులు మరింత మెరుగుపడే ఆస్కారం ఉందని చెప్పుకొచ్చారు. ఇరు రాష్ట్రాలు భవిష్యత్‌లోనూ ఇలాగే పరస్పరం సాయం చేసుకుంటూ ముందుకెళ్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version