ఉద్యోగులు ఎవరి ప్రోద్బలంతోనో, భావోద్వేగంతోనో కాకుండా సంయమనంతో ఆలోచించాలని కోరుకుంటున్నాం అని మంత్రి పేర్ని నాని కోరారు. ఉద్యోగుల పట్ల సానుభూతి ఉండటం వల్లే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 27 శాతం ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించారని ఆయన అన్నారు. మంచి మనసుతో ఆలోచించాలని ఉద్యోగులను కోరుతున్నానని ఆయన అన్నారు. ఉద్యోగులను కన్నబిడ్డల్లా చూసుకోవాలనే సీఎం తాపత్రయం అని..కన్నబిడ్డల కోరికలు తీర్చలేని పరిస్థితిలో కన్నతల్లి దండ్రులు పడే ఆవేదన సీఎం పడుతున్నారు మంత్రి పేర్ని నాని అన్నారు.
ఉద్యోగులను కన్నబిడ్డల్లా చూసుకోవాలనే సీఎం తాపత్రయం- పేర్ని నాని
-