విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెలలో నిర్వహించనున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల తేదీలను అధికారులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం, పరీక్షలు ఈ క్రింది తేదీల్లో ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి:

Tenth Students
 

మే 19: ఫస్ట్ లాంగ్వేజ్ & పేపర్-1 (కాంపోజిట్ కోర్సు)
మే 20: సెకండ్ లాంగ్వేజ్
మే 21: ఇంగ్లిష్
మే 22: గణితం
మే 23: ఫిజిక్స్
మే 24: బయోలజీ
మే 26: సాంఘిక శాస్త్రం
మే 27: ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు) & OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
మే 28: OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ షెడ్యూల్‌ను గమనించి, తగిన విధంగా సన్నద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది. పరీక్షల సమయం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుందని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news