AP:మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తున్న.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు

-

2019 నుంచి 2024 వరకు ఆంధ్ర ప్రదేశ్ నేల భయపడిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో జరుగుతున్న వారాహి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత 5 సంవత్సరాలలో అధికారులు, పోలీసులు కూడా వణికిపోయారని మండిపడ్డారు.

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారని తెలిపారు. అసెంబ్లీలో జనసేన ఎలా అడుగుపెడుతుందో చూస్తామన్న గత ప్రభుత్వ మంత్రుల వ్యాఖ్యలను పిఠాపురం ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారని ఆయన తెలిపారు. అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని వెళ్లే అవకాశం జనసేనకు ఇచ్చారని అన్నారు. గ్రామ స్వరాజ్యం కోసం తాను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నానని డిప్యూటీ సీఎం చెప్పారు. తనకు లంచాలు అవసరం లేదని, కానీ కాంట్రాక్టర్లు కచ్చితంగా నీతిగా పని చేయాలని ఆయన సూచించారు. ప్రజల సొమ్ముపై ప్రతీ పైసాకు లెక్క అడుగుతానని అన్నారు. ఎమ్మెల్యేగా ప్రజల ముందు మళ్లీ ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, అన్ని వర్గాల అభివృద్ధి, అభ్యన్నతి కోసమే పని చేస్తానని, లంచాలు తీసుకోనని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version