బ్రేకింగ్: కేంద్ర మంత్రికి కరోనా అపెక్స్ కమిటీ భేటీ వాయిదా…?

-

ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య ఇప్పుడు జల వివాదం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఈ జల వివాదం విషయంలో కేంద్రం కూడా జోక్యం చేసుకుంటుంది. అపెక్స్ కమిటీ ద్వారా సమస్యను పరిష్కరించాలి అని భావిస్తుంది. ఈ నెల 25న అపెక్స్ కమిటీ భేటీ కూడా నిర్వహించాలి అని కేంద్రం షెడ్యూల్ చేసింది. కాని ఇప్పుడు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కరోనా బారిన పడ్డారు.

తనకు కరోనా వచ్చింది అని తాను ఇప్పుడు ఆస్పత్రిలో ఉన్నాను అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తనను కలిసిన ప్రతీ ఒక్కరు కూడా కరోనా పరిక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఇప్పుడు ఆయనకు కరోనా సోకడం మరో 5 రోజుల్లోనే అపెక్స్ కమిటీ భేటీ ఉండటంతో ఈ భేటీ నిర్వహించే అవకాశం లేదు. దీనితో అపెక్స్ కమిటీ భేటీ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version