పాకిస్థాన్ మరోసారి రెచ్చిపోయింది. రెండో రోజు పాకిస్తాన్ డ్రోన్స్ దాడి చేసింది. పంజాబ్లోని ఫిరోజ్పుర్ జనావాసాలపై పాకిస్థాన్ వరుసగా డ్రోన్ దాడులు చేసింది. దాదాపు 20 చోట్ల దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన భద్రత బలగాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. ఇటు ఫిరోజ్పుర్లో బ్లాక్ అవుట్ ప్రకటించాయి.

ఇక అటు జమ్మూకశ్మీర్లో హై అలెర్ట్ ప్రకటించారు. జమ్మూకశ్మీర్లో భారీ శబ్దాలతో పేలుళ్లు జరుగుతున్నాయని ఎక్స్ వేదికగా తెలిపారు సీఎం ఒమర్ అబ్దుల్లా. జమ్మూ మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకూడదని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని వెల్లడించారు ఒమర్ అబ్దుల్లా.