ఏపీ సీఎం జగన్‌..ఒక చేతకానీ దద్దమ్మ – అశోక్ గజపతిరాజు

-

ఏపీ సీఎం జగన్‌..ఒక చేతకానీ దద్దమ్మఅని విమర్శలు చేశారు అశోక్ గజపతిరాజు. హామీలు కోసమే మోడీ ని జగన్ కలుస్తున్నారు అనేది నమ్మశక్యం గా ఉందా.. స్కిల్ డెవలప్మెంట్ పై ఒక విచారణ వేసి రిపోర్ట్ కూడా తెచ్చుకోలేని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి అని ఫైర్‌ అయ్యారు. ఒకే పార్టీ రాష్ట్రంలో ఉండాలి అనే మనస్తత్వం మార్చుకోవాలి.. పోలవరం అభివృద్ధి చేయడం మానేసి పనులు ఆపేశారన్నారు.

రాష్ట్రంలో ప్రజలు వైసిపి పై విసుగెత్తి పోయారు అనే విషయం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడింది… 41 ఏళ్ళు టీడీపీ విజయవంతం గా పూర్తి చేసుకోవడం సంతోషమని తెలిపారు. టీడీపీ ఎన్నో విజయాలు సాధించి దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది.. టీడీపీ ని తీసిపరేద్దాం అనుకున్న వాళ్ళు అంత కొట్టుకుపోయారని తెలిపారు. ఫెడరల్ వ్యవస్థ ని టీడీపీ ఎప్పుడు అవలంభిస్తుంది.. టీడీపీ తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే స్ఫూర్తిగా నిలిచాయని వివరించారు. చట్టాలు చుట్టలుగా మరకూడదు అనేది టీడీపీ సిద్ధాంతం.. తెలుగు ప్రజలు గౌరవం పెంచింది టీడీపీ పార్టీ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news