వచ్చే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలు కలిసే ఉంటాయి – తమ్మినేని

-

సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు బృందాలుగా ఈనెల 17 నుండి కొనసాగుతున్న జనచైతన్య యాత్ర ఈరోజు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో భారీ బహిరంగ సభతో ముగుస్తుంది. ఈ సభకు పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు కామ్రేడ్ ప్రకాష్ కారత్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. చావైనా, బ్రతుకైనా వచ్చే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలు కలిసే ఉంటాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, దేశ వినాశకార, ప్రమాదకర మతోన్మాద విధానాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ సాగిన ఈ జన చైతన్య యాత్రకు ప్రజల బ్రహ్మరథం పట్టారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news