ASIAN GAMES 2023: ఫైనల్ కు దూసుకెళ్లిన ఇండియా… సెమీస్ లో బంగ్లాదేశ్ చిత్తు!

-

ఆసియన్ గేమ్స్ లో పురుషుల క్రికెట్ లో భాగంగా ఈ రోజు ఉదయం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా మరియు బంగ్లాదేశ్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఎటువంటి ఉత్కంఠ లేకుండా వన్ సైడెడ్ గా జరిగింది. మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ గైక్వాడ్ ఫిల్డింగ్ ఎంచుకుంది బంగ్లాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా ఆరంభం నుండి పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఎంతలా అంటే… పూర్తి ఓవర్ ల పాటు బ్యాటింగ్ చేసి చివరికి 9 వికెట్ల నష్టానికి కేవలం 96 పరుగులకే పరిమితం అయింది. బంగ్లా ఆటగాళ్లలో జాకీర్ అలీ (24), పర్వేజ్ హుస్సేన్ (23) పరుగులు చేశారు.. ఇండియన్ బౌలర్లలో సాయి కిషోర్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా, సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 97 పరుగుల ఛేదనలో ఇండియా ఒక్క వికెట్ నష్టపోయి పది ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది.

తిలక్ వర్మ 26 బంతుల్లో 2 ఫోర్లు 6 సిక్సులతో 55 పరుగులు చేశాడు.. కెప్టెన్ గైక్వాడ్ 40 పరుగులు చేసి జట్టును ఫైనల్ కు చేర్చాడు.. ఫైనల్ లో పాకిస్తాన్ లేదా ఆఫ్గనిస్తాన్ తో ఇండియా పోటీ పడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version