ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాకినాడలోని రమ్య దీప్తి అనే మహిళ తన కుమారుడు అనుమానస్పద స్థితిలో మరణించారు. వివరాల్లోకి వెళితే…. కాకినాడలోని రమ్య దీప్తి (30) అనే మహిళ ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమె నాలుగేళ్ల కుమారుడు కూడా మరణించాడు. తన కుమారుడు నోటికి ప్లాస్టర్ తో ఉన్నాడు. వీరిద్దరూ అనుమానస్పద స్థితిలో మరణించారు. రమ్య దీప్తి అనే మహిళకు శరత్ తో 2020 సంవత్సరంలో వివాహం జరిగింది.
వీరికి ఓ కుమారుడు జన్మించాడు. ఈ క్రమంలోనే రమ్యను తన అత్తింటి వారు తరచుగా వేధిస్తూ ఉండేవారట. భర్త, అత్త, ఆడపడుచులు తరచూ వేధిస్తున్నారని తన పుట్టింటి వారితో చెప్పి బాధపడుతూ ఉండేదట. నిన్న ఆమె తన కుమారుడు ఇద్దరూ గదిలో మరణించి కనిపించారు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనపై రమ్య దీప్తి అత్తింటి వారిని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కూతురి మరణాన్ని చూసి రమ్య దీప్తి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శరత్ కుటుంబ సభ్యులను వదిలేది లేదని వారిని తప్పకుండా శిక్షించాలని పోలీసులను వేడుకుంటున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.