ఏపీలో దారుణం..మూగ, చెవిటి యువతిపై గ్యాంగ్ రేప్..

-

ఏపీలో దారుణం జరిగింది. మూగ, చెవిటి యువతిపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు ముగ్గురు కిరాతకులు. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరులో మూగ, చెవిటి యువతిపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు ముగ్గురు కిరాతకులు. అయితే.. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

attach on mute and deaf young woman

అదే గ్రామానికి చెందిన మూగా చెవిటి యువతిపై అత్యాచారం చేశారు ముగ్గురు వ్యక్తులు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు…ఆ అమ్మాయిపై పలుమార్లు అత్యాచారం చేశారట. దీంతో అమ్మాయి కడుపులో నొప్పి వస్తుందని బాధపడింది. ఈ తరుణంలోనే హాస్పటల్ కి వెళ్లడంతో కడుపుతో ఉందని వైద్యులు పేర్కొనడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కంకిపాడు పోలీసులు. ప్రస్తుతం ఆ ముగ్గురు యువకులు పరారీ ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version