వరంగల్ రజతోత్సవ సభ కోసం ఆటో సంఘాల విరాళం

-

ొాతెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభను గ్రాండ్‌గా నిర్వహించాలని గులాబీ పార్టీ అధిష్టానం భావిస్తున్నది. ఈ క్రమంలోనే వరంగల్ ఎల్కతుర్తి వద్ద భారీ బహిరంగ సభను ఈనెల 27న నిర్వహించనున్నది.

అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లను సైతం చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది జనాభాతో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అందుకోసం భారీజనసమీకరణ చేయాలని కేసీఆర్ పార్టీ జిల్లా నేతలకు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం తెలంగాణ భవన్‌లో వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో సంఘాలు మద్దతు పలికాయి.సభ కోసం రూ.26వేల విరాళం చెక్కును కేటీఆర్‌కు ఆటో డ్రైవర్ల యూనియన్ అందజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news