టోక్యో ఒలంపిక్స్ : రెజ్లర్ భజరంగ్ కు కాంస్య పతకం

-

టోక్యో ఒలంపిక్స్ క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. ఇవాళ జరిగిన రెజ్లింగ్ మ్యాచ్ లో భజరంగ్ పునీయా ను కాంస్య పతకం వరించింది. రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో భజరంగ్ పునీయా పతకం సాధించాడు. ఇవాళ మధ్యాహ్నం కజకిస్తాన్ దేశానికి చెందిన జేకొవ్ తో భారత రెజ్లర్ భజరంగ్ పునీయా పోటీ పడ్డాడు.

అయితే ఈ పోటీల్లో… అనూహ్యంగా భజరంగ్ పునీయా ఘన విజయం సాధించారు. కజకిస్తాన్ రేజ్లేర్ జెకొవ్ పై 8-0 తేడాతో భజరంగ్ పునీయా విజయం సాధించాడు.  ఈ విజయం తో కాంస్య పతకం భారత్ వశం అయింది. ఇక ఈ కాంస్య పతకం తో భారత్ కు వచ్చిన పతకాల సంఖ్య.. ఆరు కు చేరింది. ఇప్పటివరకు టోక్యో ఒలంపిక్స్ లో భారతదేశానికి ఆరు పతకాలు వచ్చాయి. మొత్తం ఆరు పథకాల్లో రెండు రజతాలు కాగా నాలుగు కాంస్య పతకాలు. ఇక ఈ విషయంపై భజరంగ్ పునీయా ఆనందంలో మునిగి తేలాడు.

Read more RELATED
Recommended to you

Latest news