బాలకృష్ణ కాళ్ళు మొక్కిన ఏపీ హోంమంత్రి, బీసీ వెల్ఫేర్ మంత్రి

-

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో చంద్రబాబు ప్రకటించిన విధంగానే ఏపీ రాజధానిగా ఉంటుందని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టంచేశారు. ఇక విశాఖపట్నం రాష్ట్రానికి ఫైనాన్స్ క్యాపిటల్‌గా కొనసాగుతుందని, కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేపడుతోంది.

ఇక ఏపీ కేబినెట్‌లో చంద్రబాబు మహిళలకు తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే హోంమంత్రిగా అనిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సవితకు అవకాశం ఇచ్చారు. వీరిద్దరూ తమదైన శైలిలో పాలనను కొనసాగిస్తున్నారు.తాజాగా ఈ ఇద్దరు మహిళా మంత్రులు చేసిన పనికి కొందరు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. హోంమంత్రి అనిత, బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కాళ్లకు మొక్కారు. దానిని వైసీపీ నేతలు ట్రోల్ చేస్తుండగా.. టీడీపీ వాళ్లు పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకుంటే తప్పేంటని వెనకేసుకొస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version