బాలయ్య, జూ.ఎన్టీఆర్ లపై వచ్చిన వార్తలు అబద్దమేనా…

-

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈ చిత్రంలో లీడ్ రోల్ లో పోషించనుంది. అయితే జయలలిత సినీ జీవితంలో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన సీనియర్ ఎన్టఆర్ తో కూడా జయలలిత చాలా సినిమాల్లో ఆడిపాడింది.దీంతో జయలలిత బయోపిక్ లో సీనియర్ ఎన్టీఆర్ రోల్ ఖచ్చింతంగా ఉంటుంది.

అయితే ఆ సినిమాలో వచ్చే సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో వారి తనయుడు నందమూరి బాలకృష్ణ, మనవడు జూ.ఎన్టీఆర్ నటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే తొలుత ఈ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడని ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ ఈ పాత్రను అంగీకరించినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్యనే బాలకృష్ణ కూడా ఆ పాత్రను వదులుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి…

అయితే ఇప్పుడు ఆ చిత్ర దర్శకనిర్మాతలు దీనిపై ఓ క్లారిటీ ఇచ్చారు. సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు తాము జూ.ఎన్టీఆర్ ని కానీ, నందమూరి బాలకృష్ణని కానీ సంప్రదించలేదని, వీటిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పేశారు. దీంతో ఇన్నాళ్లూ వీటిపై వచ్చిన వార్తలన్నింటీకీ ఫుల్ స్టాప్ పడినట్లయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version