దేవబ్రాహ్మణులకు బాలయ్య క్షమాపణలు..పొరపాటుగా అన్నానంటూ !

-

దేవబ్రాహ్మణులకు బాలయ్య క్షమాపణలు..పొరపాటుగా అన్నానంటూ ఓ లేఖ విడుదల చేశారు బాలయ్య. దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని నాకందిన సమాచారం తప్పు అని నాకు తెలియజెప్పిన.. దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఈ లేఖలో తెలిపారు.

నేనన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డానని.. నాకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదు , ఉండదని కూడా తెలుగు ప్రజలందరికీ తెలుసు అని వివరించారు.

దురదృష్టవశాత్తూ ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమేనని.. అంతేకానీ సాటిసోదరుల మనసు గాయపరచటం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండని కోరారు. పైగా దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారు ..నావాళ్లను నేను బాధపెట్టుకుంటానా ?..అర్ధం చేసుకుంటారని భావిస్తున్నానని తెలిపారు.. పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నానని వెల్లడించారు నందమూరి బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version