బాలయ్య మందు సీసా వివాదం… నిర్మాత నాగవంశీ రియాక్షన్ ఇదే !

-

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను రూపొందించాడు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా అంజలి ముఖ్య పాత్రలో నటించింది.మేకర్స్ ఈ సినిమాను మే 31 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు .ఈ ఈవెంట్ కు నట సింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో నటుడు బాలకృష్ణ కుర్చీ వద్ద మద్యం సీసా ఉన్నట్లుగా వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దానిపై నిర్మాత నాగవంశీ రియాక్ట్ అయ్యారు. ‘బాలయ్య హీరోయిన్ను సరదాగా నెట్టిన వీడియోను వైరల్ చేస్తున్నారు కానీ తర్వాత వాళ్లు హైఫై కొట్టుకున్నారు. అది ఎందుకు ఎవరూ చూపించడం లేదు? అని ప్రశ్నించారు..అసలు ఆయన కుర్చీ దగ్గర అసలేం లేవు. ఈవెంట్ చేసింది నేనే కదా. అవన్నీ సీజీలో పెట్టారు’ అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news