బాలయ్య బాబు ఒప్పుకోలేదు.! కాని చిరు మాత్రం.!

-

సంక్రాంతి పండుగను తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరుపుతారు. పండుగ జరిగే రోజుల్లో ఎంత చెత్త సినిమా వున్న, అది మంచి థియేటర్ కాకపోయినా హౌస్ ఫుల్ అవుతుంది. అందుకే హీరోలు సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇలాంటి పోటీ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలయ్య వీర సింహ రెడ్డి సినిమాల మధ్య ఉండడంతో మైత్రీ మూవీస్ వారికి తల నొప్పి మొదలైంది.

ఇద్దరి సినిమాలు వీరి ప్రొడక్షన్ లోనే రావటం తో ఏమి చేయాలో పాలు పోవడం లేదట. ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా టఫ్ ఫైట్ వుంది. ఆది పురుష్ సినిమా కూడా లైన్ లోనే వుంది., అలాగే బడా నిర్మాత దిల్ రాజు విజయ్ సినిమా వారసుడు తో పోటీ లో వున్నారు.ఇప్పుడు సినిమాల మధ్య మరింత పోటీ ఎక్కువగా వుండే అవకాశం ఉందని అంటున్నారు.

ముందు మైత్రీ వారు బాలయ్య దగ్గరకు వెళ్ళి సినిమా తొందరగా పూర్తి చేసి డిసెంబర్ నెలలో విడుదల చేద్దామనే ప్రపోజల్ పెట్టగా బాలయ్య బాబు ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాతికి రావాలని చెప్పారట. ఇక లాభం లేదనుకుని కొంచం మెత్తటి మనస్తత్వం వున్న చిరంజీవి ని కలసి వాల్తేరు వీరయ్య ను కొంచెం వారం రోజులు ముందుగా తీసుకొని వద్దామని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి చిరు కూడా మైత్రీ వారు నష్ట పోకుండా చూడాలని సానుకూలం గానే వున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version