చంద్రబాబు, అచ్చెన్నాను తప్ప..టీడీపీ నేతలను వైసీపీకి తెచ్చుకుంటాం – బాలినేని

-

చంద్రబాబు, అచ్చెన్నాను తప్ప..టీడీపీ నేతలను వైసీపీకి తెచ్చుకుంటామని హెచ్చరించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మంత్రివర్గ విస్తరణ, ముందస్తు ఎన్నికలపై జరగుతున్న ప్రచారాలు మీడియా సృష్టి తప్ప ఏమీ లేదు..వైసీపీ తెచ్చుకోవాలనుకుంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప అందరూ వస్తారని హెచ్చరించారు.

45 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉంటే ఇద్దరిని ఎందుకు కొనుక్కున్నారు..డబ్బులు ఇచ్చి ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన పరిస్దితి వచ్చిందని తెలిపారు. హైప్ చేసుకోవటం తప్ప ప్రచారంలో నిజం ఏమీ లేదు..సీఎం జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యేలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. సంక్షేమ పధకాలతో రాష్ట్రం అప్పుల పాలైందని చంద్రబాబు అంటున్నారు..గత ప్రభుత్వ హాయంలో ఉన్న అప్పులు ఎంత.. ఇప్పుడు తీసుకున్న అప్పులు ఎంతో చంద్రబాబు చెప్పాలని కోరారు. గత ప్రభుత్వ హాయాంలో తెచ్చిన అప్పులు దేని కోసం ఖర్చుపెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టే ప్రజల దగ్గరకు ధైర్యంగా వెళ్లగలుగు తున్నామన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version