ఈటలపై బాల్క సుమన్ సంచలన ఆరోపణలు..పుణె, బెంగుళూర్ లో మీటింగ్ లు !

-

ఈటల రాజేందర్ పై బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. హుజూరాబాద్ ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా వారియర్స్ సమ్మేళనం కార్యక్రమానికి హాజరయ్యారు బాల్క సుమన్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 2001లో కేసీఆర్ నాయకత్వంలో టీఆరెఎస్ పురుడు పోసుకుందని…ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తీసుకువచ్చాడని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తన లాంటి వాళ్లను కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులను చేశాడని చెప్పారు. మామూలు ఈటెల రాజేందర్ ను తీసుకు వెళ్ళి ఇంట్లో పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ పెంచుకున్నడని… ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి పని చేయకుండా అవతలోడికి పని చేసిన వ్యక్తి ఈటెల అని ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికులతో ఈటలనే సమ్మె చేయించాడని…ఆ కార్మిక సంఘం నాయకుడు అశ్వత్థామ రెడ్డి ఇప్పుడు ఈటెల వెంబడి ఉన్నాడని ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను విమర్శించాడని… పుణె, బెంగుళూర్ లో పార్టీ వ్యతిరేక మీటింగ్ లు పెట్టుకున్నారని ఆరోపణలు చేశారు. తాను ఉసరవెల్లిలా రంగులు మార్చలేనని..తాను ప్రజలకు బానిసను అని పేర్కొన్నారు. నీకన్న పార్టీలో సీనియర్లు కొప్పుల ఈశ్వర్, నారదాసు లక్ష్మణ్ రావులు ఉన్నారని…వారు ఎప్పుడు పదవుల కోసం ఆలోంచి చలేదని పేర్కొన్నారు. బిజేపి చెప్పే అబద్దాలకు, టీఆరెఎస్ కు మధ్య ఇక్కడ పోటీ అని…బిజేపిని కొంచెం కూడ ఇక్కడ మొలక ఎత్తనివ్వద్దని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version