సీఎం కేసీఆర్‌ బలుపెక్కి, కండకావరంతో మాట్లాడుతున్నాడు – బండి సంజయ్‌

-

మోడీ ఛాన్స్‌ ఇచ్చాడు..కేసీఆర్.. నీ అంతు చూస్తామని బండి సంజయ్‌ ఇచ్చారు. ఖమ్మం, రామాయంపేట యువకుల ఆత్మహత్యలకు సీఎం, మంత్రి పువ్వాడ, టీఆర్ఎస్ నేతలే కారణమని ఆగ్రహించారు. సీఎం, మంత్రులు బలుపెక్కి కండకావరంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని.. టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడే పార్టీ బీజేపీ కాదన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో వాడే కరెంట్ తో 10 గ్రామాలకు ఫ్రీగా విద్యుత్ సరఫరా చేయొచ్చని… కేసీఆర్ ను గద్దె దించేదాకా నా పోరు ఆగదని హెచ్చరించారు.


ఆసుపత్రి, కాలేజీ కూడా కట్టించలేని దద్దమ్మ కేసీఆర్ అని.. కేసీఆర్ చేతగానితనంవల్ల పక్క రాష్ట్రాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర 3వ రోజు పాదయాత్రలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

‘ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 3వ రోజు కంచుపాడు నుండి పాదయాత్ర ప్రారంభించి మధ్యాహ్నం వరకు తక్కశిల వరకు నడిచారని.. సంజయ్ పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కదిలించిన సమస్యల ఏకరవు పెట్టారని వెల్లడించారు. వారందరికీ భరోసా కల్పిస్తూ ముందుకు కదిలారు. తక్కశిల వద్ద గ్రామస్తులతో ‘ప్రజల గోస- బీజేపీ భరోసా‘ పేరిట రచ్చబండ నిర్వహించారని.. మోదీ వాక్సిన్ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి.. ఈరోజు మనం మాస్కులు లేకుండా తిరగగలుగుతున్నామంటే మోదీ వల్లేనని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version