ఇదే నా లక్ష్యం… వీరభద్రుడి సన్నిధిలో బండి సంజయ్ కామెంట్స్..!

-

నరేంద్ర మోడీ నీ మూడవసారి ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నానని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఆయన చేపట్టిన ప్రజాహిత యాత్ర మంగళవారం మూడో రోజుకి చేరుకుంది. యాత్ర ప్రారంభంనికి ముందు బండి సంజయ్ కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

తర్వాత మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీని తిరిగి దేశ ప్రధానిగా గెలిపించాలని మోడీ చేసిన అభివృద్ధిని ఇచ్చిన హామీలను గ్రామ గ్రామాన గడప గడప కి తెలియజేస్తున్నానని చెప్పారు. ఈరోజు భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాల్లో యాత్ర కొనసాగుతుందని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news