కాళేశ్వరం పేరుతో సీఎం ఫామ్​హౌస్​కు పైపులైన్ : బండి సంజయ్

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికో ఉద్యోగమని చెప్పి.. ఆయన ఇంట్లోనే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్ ఫామ్​హౌస్​కు పైపులైన్ వేసుకున్నారని ఆరోపించారు. . తన ఫామ్​హౌస్​లో నీటి కోసం అక్షరాల లక్షా 30 వేల కోట్లు ఖర్చు చేశాడని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం పెద్ద పలుగు తండాలో గిరిజనుల బతుకుల భరోసాకై రచ్చ బండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

రచ్చబండలో గిరిజనుల సమస్యలు బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తెలంగాణలో పేదల ప్రభుత్వం రావాలన్నారు. మీరు గతంలో చేయి గుర్తుకు, కారు గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేశారు, ఈసారి పువ్వు గుర్తుకు ఓటు వేయాలని బండి సంజయ్ పిలుపు నిచ్చారు. గుర్రంపోడులో రైతుల భూములు తీసుకుని.. 60 మందిని జైల్లో పెట్టారని గుర్తు చేశారు. ఇందులో పురుషులు స్త్రీలు, గర్భిణులు కూడా ఉన్నారు. కేసీఆర్ దళితులకు 3 ఎకరాల ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతులకు ఉన్న భూమి ప్రభుత్వం తీసుకోకుంటే చాలన్నారు.

భువనగిరి టీచర్స్ కాలనీ నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాద యాత్ర, వర్షం కురుస్తున్నప్పటికీ మధ్యాహ్నంకి ముగ్దుమ్​పల్లికి చేరుకుంది. భోజన విరామం అనంతరం సాయంత్రం బండి సంజయ్ పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. పాదయాత్ర బీబీనగర్ మండలం చిన్న పలుగు తండాకి చేరుకోగానే గ్రామస్తులు బండి సంజయ్​కి గిరిజన నృత్యాలతో ఘన స్వాగతం పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news