బిజెపి జెండాను చూస్తేనే టీఆర్ఎస్ నేతలు గజగజ వణికిపోతున్నారు – బండి సంజయ్‌

-

టీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార ను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో బిజెపి శ్రేణులపై టిఆర్ఎస్ మూకలు బరి తెగించి దాడికి పాల్పడటం హేయనీయమని ఫైర్‌ అయ్యారు. బిజెపి జెండాను చూస్తేనే టీఆర్ఎస్ నేతలు గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు.

జనం గోస- బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలతో గ్రామాల్లోకి వెళుతూ ప్రజాస్వామ్య బద్దంగా కార్యక్రమాలు చేస్తున్న బీజేపీ శ్రేణులను ప్రజలు ఆదరిస్తుండటంతో టీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులపై దాడులు చేస్తూ గ్రామాల్లోకి రానీయకుండా అడ్డుకుంటెంటే చర్యలు తీసుకోవలసిన పోలీసులు టీఆరెస్ నేతలకు కొమ్ము కాస్తూ బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే అరెస్టయిన బీజేపీ నేతలను విడుదల చేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version